![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle49766745-f861-458a-a97a-eae7c95e434e-415x250.jpg)
ఐతే ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణకు గతంలో ఇచ్చిన మాట మేరకు ఆయనకు ఈ సినిమాను రాజమౌళి చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఐతే నారాయణ సంస్థ దుర్గా ఆర్ట్స్ చాలా ఏళ్లుగా ప్రొడక్షన్కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేయగలరా అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ నారాయణ అండ్ టీమే ఈ సినిమాను నిర్మించే విషయంలో ఏ అనుమానాలు అక్కర్లేదని.. ఆయన టీం కథా చర్చల్లో, అలాగే ప్రి ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటోందని వెల్లడైంది.
'దుర్గా ఆర్ట్స్'లో భాగస్వామి, ఆ సంస్థ సమర్పకుడు అయిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి.. తాజాగా మహేష్-రాజమౌళి సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. తాను ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొన్నానని.. కథ కూడా తనకు తెలుసని గోపాల్ రెడ్డి వెల్లడించారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలు కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసని.. మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మొద్దని గోపాల్ రెడ్డి తెలిపారు. అంతే కాక ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.