ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19న తమిళనాడు, పుదుచ్చేరిలో పార్లమెంట్ ఎన్నికల్ పోలింగ్ ఒకే దశలో ముగిసింది.ఈ ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అలాగే విజయ్ దళపతి కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశాడు. కొన్నాళ్లుగా రష్యాలో డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కానీ తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయ్ రష్యా నుంచి చెన్నై వచ్చారు. అయితే విజయ్ వల్ల తమకు ఇబ్బంది కలిగిందంటూ ఓ సామాన్యుడు దళపతి పై కేసు పెట్టాడు. ఇప్పుడిదే విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇన్నాళ్లు స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవలే తమిళ వెట్రి కళగం పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 19న తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రష్యా నుంచి చెన్నై వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు విజయ్. అప్పటికే వందల మంది అభిమానులు విజయ్ ఇంటి వద్ద వెయిట్ చేస్తున్నారు. అభిమానులను ప్రేమగా పలకరించిన విజయ్.. అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దాదాపు 200 మంది అభిమానులతో కలిసి పోలింగ్ బూత్ వద్దకు విజయ్ వచ్చి ఓటు వేశారని.. అంతమంది జనాలు పోలింగ్ బూత్ లోకి రావడంతో అక్కడున్నవారికి ఇబ్బంది కలిగిందని ఓ సామాన్య వ్యక్తి విజయ్ పై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 200 మందితో వచ్చి ఓటేసేందుకు వచ్చిన ప్రజలకు విజయ్ ఇబ్బంది కలిగించాడని… ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన విజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఓటు వేయడానికి వచ్చిన విజయ్ అనుకోకుండానే మరో వివాదంలో చిక్కుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: