సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజిని , శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను అందుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఈ సినిమా తర్వాత పలు మూవీ లలో రజిని నటించినప్పటికీ ఆ మూవీ లు ఏవి కూడా భారీ విజయాన్ని అందుకోలేదు . అలా చాలా సంవత్సరాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను ఎదుర్కొన్న రజిని పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో రూపొందిన జైలర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అప్పటి వరకు ఏ తమిళ సినిమా కలెక్ట్ చేయని కలెక్షన్ లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం రజిని , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను విడుదల చేస్తూ ఈ మూవీ యూనిట్ ఓ వీడియోను విడుదల చేయగా దానికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే ఈ మూవీ లో శృతి హాసన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా కోసం రజనీ తీసుకోబోతున్న రెమ్యూనిరేషన్ కు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ కి రజిని 260 నుండి 280 కోట్ల మధ్యలో పారితోషకం తీసుకుంటున్నట్లు ఇది ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనిరేషన్ అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: