![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/tollywood15445e54-b498-4dfa-b431-b452c873f20c-415x250.jpg)
నిర్మిస్తున్నారు. కాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపోతే ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాలవల్ల డిలే అవుతూ వస్తోంది. అయితే మళ్ళీ ఇప్పుడు మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కంప్లీట్ అయింది .విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. కాగా కమలహాసన్ నటించిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింమ్స్ వీడియో సినిమాపై
అంచనాలను తారా స్థాయికి తీసుకువెళ్ళింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. వారితోపాటు సిద్ధార్థ్ ప్రియా భవాని శంకర్ ఎస్ జె సూర్య బాబి సింహ వంటి వారందరూ కొన్ని కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే ఇండియన్ టు సినిమాతో పాటు ఇండియన్ త్రీ కి కూడా షూటింగ్ ఒకేసారి జరిపినట్లుగా ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే మొదట ఇండియన్ 2 సినిమాని మేకర్స్ జూలైలో విడుదల చేస్తాము అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని అన్నారు.