![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/tarak3566cc35-f554-47f9-8062-7a2a4426b124-415x250.jpg)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత లో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తారక్ హీరోగా నటించగా.. పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇక ఇదే మూవీ లో ఈషా రెబ్బ సెకండ్ హీరోయిన్గా నటించగా.. తన అందం అభయంతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఈ అమ్మడి పాత్రనిడివి చాలా తక్కువగా ఉండడంతో.. సినిమాలోని కొన్ని సన్నివేశాలలో ఇలా వచ్చి అలా మెరుపుతీగల వెళ్లిపోయింది తప్ప.. పెద్దగా ఆ పాత్రతో ఈషా రెబ్బకి మాత్రం గుర్తింపు రాలేదు. ఇదే విషయం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో తొలుతా నటించేందుకు తాను ఒప్పుకోలేదు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. నాకు ప్రధాన పాత్ర చేయాలని ఉండడంతో నేను సెకండ్ హీరోయిన్ రోల్ కోసం సైన్ చేయలేదు. కానీ నాది కూడా మెయిన్ హీరోయిన్ పాత్రే అంటూ దర్శక నిర్మాతలను ఒప్పించి నాతో సైన్ చేయించారు. కానీ ఆ తర్వాత నేను నటించిన అన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయాయి. కనీసం సెకండ్ లీడ్ గా కూడా నాకు పేరు రాలేదు. అందుకే అరవింద సమేత సినిమా చేసినందుకు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది ఈషా రెబ్బ.