![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle4c602eb0-a692-4ad7-849e-fc79247bc9b6-415x250.jpg)
యూఏఈ ప్రభుత్వం.. ప్రత్యేకంగా ఇచ్చే గోల్డెన్ వీసా అవార్డు గురించి కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. యూఏఈ ప్రభుత్వం చిరంజీవికి గోల్డెన్ వీసాను అందించింది. అయితే చిరంజీవి కన్నా ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. మెగాస్టార్ కన్నా ముందు ఆయన కోడలు ఉపాసన.. అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవికి కూడా దీన్ని ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక వివిధ రంగాల అంటే కళలు, సృజనాత్మకత, పరిశ్రమలు, సాహిత్యం, విద్య, వారసత్వ సంపద, చరిత్ర, కల్చర్ గురించి అధ్యయనం చేసే వారికి.. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీన్ని అందుకున్న వారు.. ఆ దేశంలో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు, తిరిగేందుకు అనమతి లభిస్తుంది. ఇక 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తుంది.
ఈ గోల్డెన్ వీసా పొందిన వారు దుబాయ్, అబుదాబితో పాటు దేశంలో ఎక్కడైనా 100 శాతం ఓనర్షిప్తో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక భారత్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న మొదటి వ్యక్తి.. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్. ఆ తర్వాత సానియా మీర్జాతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు అందుకున్నారు. ఇక దక్షిణాది నుంచి హీరోయిన్ త్రిష, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, విక్రమ్, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు ఈ వీసాని అందుకున్న వారిలో ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే నా సామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ లో బిజీగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి.