![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylef871b68c-6791-4fcb-9c81-c0017b2b1b09-415x250.jpg)
విశ్వక్ సేన్, నేహాశెట్టి, అంజలి హీరోహీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికేట్ని పొందింది. ఇక నేడు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు. విశ్వక్ సేన్తో సరదాగా మాట్లాడాడు. అన్నగా పిలిచాడు. ట్రైలర్, టీజర్ బాగుందని, గోదావరి అందాలతోపాటు మంచి ఎమోషన్ కూడా ఉందని, మంచి కిక్కించే సినిమాలా ఉందన్నారు బాలయ్య. టైటిల్ విభిన్నంగా ఉందని, సినిమాపై ఆసక్తి పెంచుతుంది, సినిమా పెద్ద విజయం సాధించాలని, సక్సెస్ మీట్లో తాను మరిన్ని విషయాలు మాట్లాడతానని తెలిపారు. దర్శకుడు, నిర్మాతలు, హీరోయిన్లకి అభినందనలు తెలిపారు బాలయ్య. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.