
ఇప్పుడు చిరంజీవితో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇది కూడా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అంటూ క్లారిటీ వచ్చేసింది . ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ సౌత్ ఇండియా క్రెజియస్ట్ హీరోయిన్ నయనతారను చూస్ చేసుకున్నారు . నయనతారని ఈ చిత్రంలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన వీడియో ఎంత హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే . సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ కి రాదు . అనిల్ రావిపూడి సినిమా పూజ కార్యక్రమాల నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు . మరి వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అయింది అనేది ఇప్పటికి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ గానే ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్లో నయనతార పాల్గొనింది . ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్ లోనొ ముస్సోరీలో జరుగుతుంది .
ఈ షెడ్యూల్ షూటింగ్లో హీరోయిన్ నయనతార కూడా రీసెంట్ గా జాయిన్ అయింది . ముసోరీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు చిరు - నయన్ ల మధ్య ఒక సాంగ్ కూడా షూట్ చేస్తున్నారట . ఈ సాంగ్ సినిమాకి చాలా ప్లస్ గా ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. కాగా షూటింగ్ సెట్లోకి వచ్చి రాగానే నయనతార చేసిన పని మెగాస్టార్ చిరంజీవి పరువు పోయినట్లు అయింది అంటూ ఓ న్యుస్ బాగా వైరల్ గా మారింది. నయనతార - చిరంజీవిని హాయ్ అంకుల్ అంటూ పలకరించిందట .
చిరంజీవిని అంకుల్ అనడం పట్ల మెగా ఫాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవుతున్నారు. చిరంజీవిని అంకుల్ అంటావా అంటూ రేంజ్ లో మండిపడుతున్నారు. నయనతారను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నయనతార చాలా సరదాగా క్యాజువల్ గానే పిలిచింది . కానీ కొంతమంది మెగా ఫాన్స్ మాత్రం దీన్ని పెద్ద రాద్ధాంతంగా చేస్తూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అంటూ కామన్ పీపుల్స్ కూడా మెగా ఫాన్స్ కి కౌంటర్ వేస్తున్నారు. కొందరు చిరంజీవి పరువు పోయింది అంటుంటే మరికొందరు నయనతారను ట్రోల్ చేస్తున్నారు . కాగా ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. సాహు గారపాటి అలాగే చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.