సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. చాలా సినిమాలు ఈ పైరసి కారణంగా నష్టపోయిన సందర్భాలు మనం చూసాం.  సినిమా రిలీజ్ అయిన 24 గంటలు కాకముందే పైరసీ వచ్చేస్తూ మేకర్స్ కి తీవ్ర నష్టాలు తీసుకొస్తుంది.  భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలకు ఈ పైరసీ పెద్ద శనిలా దాపురించింది.  కనీసం పెట్టిన పట్టుబడి అయిన రాకుండానే కొంతమంది కేటుగాళ్లు సినిమాని పైరసి చేసి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌స్ లో అమ్మేసుకుంటున్నారు . నిర్మాతల కష్టాన్ని నీరు గార్చేస్తున్నారు . ఎంతో బడ్జెట్ పెట్టి ఎన్నో ఆశలతో లాభాలు వస్తాయి అని కష్టపడి మూవీ తెరకెక్కించిన మేకర్స్ ..కొందరు కేటుగాళ్లు కారణంగా దారుణాతి దారుణమైన రిజల్ట్ అందుకుంటున్నారు.


అయితే ఇలాంటి వాళ్లపై కేంద్రం ఎప్పటినుంచో దృష్టి పెడుతూ వచ్చింది .  తాజాగా తీసుకున్న కఠిన చట్టం పైరసీ చేయాలి అన్న కేటుగాళ్లకు వణుకు పుట్టించేలా చేస్తుంది. ఎవరైనా సరే సినిమా ని పైరసీ చేసి అమ్ముకున్న సినిమా పైరసీని ఎంకరేజ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ వారిని కఠినంగా శిక్షిస్తుంది . తాజాగా సినిమా ల పైరసీని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సినిమా ఆటోగ్రాఫీ చట్టాన్ని సవరించింది . ఇప్పటినుంచి ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా సినిమాలను ప్రసారం చేసిన.. అలాగే రికార్డ్ చేసి పైరసీ రిలీజ్ చేసిన మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు నిర్మాణ వ్యాయాయంలో 5% వరకు జరిమాన కట్టాల్సిందే .



ఖచ్చితంగా జైలుకు వెళ్లి చిప్పకూడు తినాల్సిందే . ఈ విధంగా చట్టాన్ని సవరించింది . గతంలో సినిమా  పైరసి చేస్తే మూడేళ్లు జైలు శిక్ష తో పాటు మూడు లక్షలు జరిమానా ఉండేది . ఇప్పుడు ఆ చట్టాన్ని మారుస్తూ మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు సినిమా నిర్మించిన వ్యయంలో ఐదు శాతం జరిమాన కట్టాలి అంటూ తేల్చి చెప్పింది ప్రభుత్వం . ఈ విషయాన్ని తాజాగా ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడించారు. దీంతో పైరసీ రాయళ్ళుకు పెద్ద తలనొప్పే స్టార్ట్ అయ్యింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: