
అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ .. హైదరాబాద్ - ముంబై తిరుగుతూనే వస్తున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో బన్నీకి ఘోర అవమానం జరిగింది. చెకింగ్ దగ్గర మాస్క్ పెట్టుకున్న బన్నీని గుర్తుపట్టలేకపోయారు అధికారి . మాస్క్ తీసి ముఖం చూపించమంటూ అడిగారు. ఇది అక్కడ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెకింగ్ దగ్గర మాస్ పెట్టుకున్న బన్నీని గుర్తుపట్టని అధికారి మాస్క్ తీయమని అడిగాడు .
ఒకసారిగా షాక్ అయిపోయిన బన్నీ ఇక చేసేది ఏమీ లేక మాస్క్ తీసి తన ఫేస్ చూపించాడు. దాంతో బన్నీని లోపలికి పంపారు ఆ అధికారి. ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది . ఈ వీడియో పై రక రకాల కామెంట్స్ వినపడుతున్నాయి . అయ్యయ్యో బన్నీని గుర్తు పెట్టలేకపోయావా అంటూ ఒకరు ..బన్నీకి ఘోర అవమానం జరిగింది అంటూ మరికొందరు .. పుష్ప రాజ్ ఇమేజ్ మొత్తం దిగిపోయింది అంటూ మరికొందరు .. రకరకాలుగా ఆయనని ట్రోల్ చేస్తున్నారు . అసలు ఇందులో బన్నీ తప్పే లేదు.. కానీ బన్నీని కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. బన్నీ తప్పు లేకపోయినా బన్నీని ఇలా టార్చర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఏం చేసినా సరే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తుంది ఓ వర్గం. సోషల్ మీడియాలో బన్నీని ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా..? అని కాచుకొని వెయిట్ చేస్తుంది . వాళ్ళకి ఇది మంచి స్టఫ్ ఇచ్చిన కంటెంట్ లా మారిపోయింది. కొందరు పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి గురించి గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాపమే బన్నీకి శాపం లా మారింది అంటున్నారు..!