టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న దర్శకునిగా గుణశేఖర్ కు పేరుంది. చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో పని చేసిన గుణశేఖర్ రుద్రమదేవి సినిమా గురించి, గోన గన్నారెడ్డి పాత్ర గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గుణశేఖర్ మాట్లాడుతూ రుద్రమదేవి మూవీ తీయడానికి నాకు స్ఫూర్తినిచ్చిన చిత్రం బ్రేవ్ హార్ట్ అని ఆయన తెలిపారు.

డైరెక్టర్ గా నాకు మంచి మార్కెట్ ఉన్నప్పుడు ఈ సినిమా చేయాలని అనుకున్నానని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.  ఒక్కడు సినిమా తర్వాత  సౌత్ లో ఏ దర్శకునికి ఆఫర్ చేయని స్థాయిలో నాకు రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారని ఆయన తెలిపారు.  ఆ సమయంలోరుద్రమదేవి చేయాలనీ నిర్ణయం తీసుకుని పలువురు నిర్మాతలకు కథ చెప్పానని గుణశేఖర్ తెలిపారు.  కథ విన్న నిర్మాతలు బాగుందని అన్నారని ఆయన కామెంట్లు చేశారు.

ఆ సినిమాను హీరో బ్యాక్ డ్రాప్ లో మార్చాలని నిర్మాతలు  నన్ను కోరారని ఆయన చెప్పుకొచ్చారు.   దాంతో నేనే నిర్మాతగా మారి రుద్రమదేవి తీశానని ఆయన పేర్కొన్నారు  మహేష్ తో ఒక్కడు తర్వాత  జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించానని సెట్స్ పైకి వెళ్లే సమయానికి  కథ సరిగ్గా కుదరలేదని అనిపించిందని  గుణశేఖర్ తెలిపారు.

రుద్రమదేవి మూవీ అనుకున్నపుడు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు పేర్లు వినిపించాయని  వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసనీ వాళ్ళు కూడా ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదని గుణశేఖర్ కామెంట్లు చేశారు.  ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ పాత్రను పోషించారని ఆయన  పేర్కొన్నారు.  గుణశేఖర్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  గుణశేఖర్  కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి  క్లారిటీ  రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: