వీరి విడాకుల వ్యవహారంలో మరో నటి , రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఎంట్రీ ఇచ్చారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా జయం రవికి బహిరంగంగా మద్దతు చెబుతూ, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా, రవి చెప్పిన మాటలు అందరూ వినాలని ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. తనకు నటుడు జయం రవి చాలా బాగా తెలుసని అతను ఎంతో సున్నితమైన మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారని ,ఈ రోజుల్లో కొంతమంది మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చుట్టాలను, వ్యవస్థలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. సమాజం ఎప్పుడూ కూడా ఒకరి పక్షాన్నే వినకూడదు మగవారి వెర్షన్ కూడా వినాలి అంటూ తెలియజేసింది.
అంతేకాకుండా రవిని చూస్తే చాలా బాధగా ఉంది అతనికి కచ్చితంగా న్యాయం జరుగుతుంది, నిజం గెలుస్తుందని ఆశిస్తున్నానంటూ ఆమె ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జయం రవికి మద్దతు పలుకుతూ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ ట్విట్టర్ ను మరింత వైరల్ గా చేస్తున్నారు. తెలుగులో కూడా మీరా చోప్రా బంగారం ,వాన తదితర చిత్రాలలో నటించింది. ఇక ఈమె ఎవరో కాదు గ్లోబల్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా కు కజిన్ సిస్టర్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి