అలా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన అనే సినిమా చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన మహానటి కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తోంది. గాయపడిన మనిషి జీవిత చరిత్రగా రాబోతున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల నుండి రూపొందుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ ,తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయబోతున్నారట. అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే క్రిస్టో జేవియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. ఇప్పుడు తాజాగా టాక్సిక్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా ఇందులో భాగమయ్యారు. ఈ ఇద్దరి కాంబోతో ఈ సినిమాలో బిజిఎం సాంగ్స్ అదిరిపోయే అవకాశం ఉందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు పనిచేయబోతున్నారని తెలియడంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ సినిమా మ్యూజిక్ పాటల కోసం తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ థియేటర్లలో ఇటు సోషల్ మీడియాలో ఏ విధంగా సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి