నేడు తెలుగు రాష్ట్రాల్లో  పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పార్టీ నేతలు, విఐపీ కేడర్, సినీ తారాగణం కదిలి వస్తున్నారు.   ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..నేడు చాలా ముఖ్యమైన రోజు అని అన్నారు.


ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒక పిలుపు ఇచ్చారు.  ఓట్లు అనేవి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేవి..ఇలాంటి సమయాన్ని వృధా చేయరాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి..ఓటు హక్కు ఉన్నవారు తప్పకుండా వినియోగించుకోవాలి.


ఓటు వేస్తేనే ప్రజాస్వౌమ్యంలో అడిగే హక్కు ఉంటుంది. మనం ఓటు వేస్తే సరైనా నాయకులను ఎంచుకోగలుగుతాం..జన్మభూమిలో పుట్టినందుకు సరైన పాలకులను ఎంచుకుందాం..తప్పకుండా ఓటు వేయండి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: