పరీక్షా కేంద్రాల్ని నమోదు చేసుకున్న కేంద్రాలలో కాకుండా వందల కిలోమీటర్ల దూరంలో కేటాయించడంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రధాన పరీక్షను రాయబోయే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నుంచి గుంటూరు, కడప నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి విజయవాడకు ఇలా.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఉద్యోగ ఆన్లైన్ ప్రధాన పరీక్షా కేంద్రాలు మారాయి. దీంతో సన్నద్ధతపరంగా విలువైన సమయాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సిఉంటుందని పలువురు వాపోతున్నారు.