వీసా జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. అమెరికా ప్రభుత్వం. H-1B సహా మొత్తం 12 రకాల వీసాల జారీల కోసం తాత్కాలికంగా ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. కొత్త ఈ సంవత్సరంలో  భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పాత పద్ధతిలోనే H-1బీ వీసాలు జారీ చేయనుంది బైడెన్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న  ఆంక్షలు తొలగిస్తూ 2022 నుంచి వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ లాటరీ విధానంలో H-1B వీసాలు మంజూరు చేయనున్నారు.

అమెరికా ప్రతి సంవత్సరం 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తోంది. నిర్ణీత కోటాలో 65వేల మంది అలాగే అక్కడ ఉన్నత చదువులు చదువుకునే వారికి అదనంగా మరో 20 వేల వీసాలు అందిస్తోంది. టేక్ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటా గురించి హెచ్1బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. ట్రంపు తీసుకొచ్చిన ఈ విధానంతో ఎన్నారైల నుంచి అలాగే టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో తమకు అన్యాయం జరుగుతుందని కొందరు ఎన్నారైలు కోర్టును ఆశ్రయించారు. 2022 ఆర్థిక సంవత్సరానికి అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఎమిగ్రేషన్స్ సర్వీసెస్ కు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

 మరోవైపు ట్రంపు ప్రవేశపెట్టిన వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని క్యాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్ని కొనసాగిం చాలని జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రభావం వివిధ కారణాలతో హెచ్1బీ వీసాలతో పాటు ఇతర వీసాల మంజూరులో ఆల స్యం అవుతోంది. దీంతో వ్యక్తిగత ఇంటర్వ్యూ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బైడెన్ సర్కార్ తెలిపింది. ఈ నిర్ణయంతో కొత్త ఏడాది అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఊరట లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: