మహిళలకు అత్యంత ప్రీతికరమైన వస్తువు ఏది అంటే ప్రతి ఒక్కరూ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తారు.. అది ఏదో కాదు బంగారం అని. ఎందుకో బంగారాన్ని ఇష్టపడినంతగా మహిళలు ఇంకేదాన్ని కూడా ఇష్టపడరు. ఇక ఒంటినిండా బంగారం ఉన్నా బరువు అనుకోకుండా మోస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త నగలను వేసుకోవడానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. దీంతో భారత దేశంలో సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది బంగారం ఒక్కటే. సామాన్యులు తమ తాహతుకు తగ్గట్లుగా కాస్త బంగారం కొంటే.. ఇక సంపన్నులు కేజీలకు కేజీలు బంగారం కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు.



 అయితే భారత్ పొరుగు దేశమైన  పాకిస్తాన్లో మాత్రం బంగారం ధర వింటే ఏకంగా హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర 59,100 గా ఉంది. అయితే వివిధ నగరాలను బట్టి స్వల్పంగా మారుతూ ఉంటుంది  కానీ పాకిస్తాన్లో బంగారం ధర ఎంతో తెలిస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్ముతాయి అని చెప్పాలి. బంగారం అంటే ఇష్టపడే మహిళలు సైతం ఇక ముక్కున వేలేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భారత్లో ఉన్న ధరతో పోల్చి చూస్తే ఏకంగా ఒక తులం బంగారం కొనడానికి నాలుగు రేట్లు ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి పాకిస్థాన్ లో ఏర్పడింది.


 ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవయోల్బణం పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిత్యావసరల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇక బంగారం ధర అయితే వింటేనే భయపడేలా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 2,22,900 కు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,89470 రూపాయలుగా ఉంది అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఒక తులం బంగారంతో మన దేశంలో చిన్న సైజు కారు కొనవచ్చు అని చెప్పడంలోనూ ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: