భారత పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ప్రస్తుతం ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు పెరిగి పోతుంది. దీంతో అక్కడ ప్రజలు కనీసం మూడు పూటలా కడుపునిండా తినలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం  కారణం  గా నిత్యవసరాల ధరలు మొత్తం ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి. దీంతో సామాన్యులు కనీసం రోజు వారి సరుకులు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.


 అదే సమయంలో అక్కడి ప్రభుత్వం ఇక దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడం విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో రోజురోజుకు ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి రోజు భారం గాని మారిపోతుంది అని చెప్పాలి. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో అక్కడికి ప్రభుత్వం ఉంది అంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఏకంగా సరిహద్దుల వద్ద శత్రు దేశాల నుంచి ఉన్న ముప్పును తరిమి కొడుతూ పహారా కాయాల్సిన సైనికులు ఇప్పుడు రైతులుగా మారబోతున్నారు.


 ఈ క్రమం లోనే  మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ సైన్యం వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతుంది అనేది తెలుస్తుంది. తీవ్రమైన ఆహార సంక్షోభం అశాంతి నుంచి బయట పడెందుకే.. ఇక సైన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుందట. ఈ క్రమం లోనే తొలి దశలో 1000 ఎకరాలలో పంట పండించ బోతుందట. పాకిస్తాన్ సైన్యం ఇక ఆ తర్వాత ఆ పంటను 41 వేల ఎకరాలకు విస్తరించి ఉన్నారట. ఇందుకు గాను పంజాబ్ ప్రభుత్వం కైబర్ ఫక్తున్వా ప్రావిన్స్ లో సైన్యానికి 45 వేల ఎకరాల భూమిని కేటాయించిందట. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: