ప్రేమ గుడ్డిదంటారు. ప్రేమ కోసం యువతీ యవకులు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఇటీవల తన ప్రేమకు, కామ కార్యకలాపాలకు అడ్డువస్తుందని ఓ యువతి ఏకంగా తల్లినే చంపిన ఘటన హయత్ నగర్ లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోయువతి తన ప్రియుడి కోసం ఏకంగా దొంగతనానికి పాల్లడింది. అక్క ఇంట్లోనే బంగారం దొంగతనం చేసింది.

 

వివరాల్లోకి వెళ్తే.. 20 ఏళ్ల మెండు ఝాన్సీ రామంతాపూర్‌లో నివసిస్తోంది. ఆమెకు బింగి రాహుల్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతడు బంజారాహిల్స్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్ కు డబ్బు అవసరం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ప్రేయసిని అడిగాడు. తన దగ్గర ప్రియుడు అడిగినంత డబ్బు లేకపోవడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు.

 

అదే సమయంలో ఫీర్జాదిగూడ బుద్ధానగర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి ఝాన్సీ వెళ్లింది. అక్క దగ్గర ఉన్న బంగారు నగలపై ఆమె కన్నుపడింది. అదే సమయంలో డబ్బు కోసం ప్రియుడు పడుతున్న వేదన ఆమెకు గుర్తొచ్చింది. అంతే అక్కడ ఇంటి నుంచి ఏదో పని మీద బయటకు వెళ్లగానే.. బీరువా నుంచి బంగారు నగలు కొట్టేసింది. ఏమీ ఎరగని దానికి తన ఇంటికి వెళ్లిపోయింది. అవి తీసుకెళ్లి రాహుల్ కి ఇచ్చింది. రాహుల్ వాటిని తన స్నేహితుడు నిఖిల్‌ )తో కలిసి వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నాడు.

 

ఆ తర్వాత నగలు పోయిన విషయం తెలుసుకున్న అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారం పోయిందని బాధితురాలు చేసిన ఫిర్యాదుతో కదిలిన పోలీసులకు ఝాన్సీపై అనుమానం వచ్చింది. తమదైన స్టయిల్లో విచారించేసరికి ఆమె నేరం ఒప్పుకుంది. రాహుల్‌, నిఖిల్‌, ఝాన్సీని పోలీసులు అదుపులోకి తీసుకొని నాలుగు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: