ఎంతో విలువైన మనుషుల ప్రాణానికి నేటి రోజుల్లో విలువ ఉందా అంటే లేదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. దీనికి కారణం రోజురోజుకు తెర మీదికి వస్తున్న ఘటనలు. ఎంతో విలువైన మనుషులు ప్రాణాలను చిన్నచిన్న కారణాలకే తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో  తీరని విషాదాన్ని నింపుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని అయోమయంలో పడేస్తున్నాయి. టీచర్ తిట్టిందని లేదా తల్లిదండ్రులు మందలించారని... ఇలా చిన్నచిన్న కారణాలతోనే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్న  ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.



 క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. దీంతో ఎంతో మంది తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలిపోతుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. సదరు యువకుడికి కడుపునొప్పి వచ్చింది. ఇక కొంత సమయంపాటు భరిస్తూ వచ్చిన సదరు యువకుడు కడుపు నొప్పి ఎక్కువ కావడంతో భరించలేకపోయాడు. ఇక తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. కడుపునొప్పి అంతకంతకూ తీవ్రమవుతున్న తరుణంలో చివరికి... ఆసుపత్రికి వెళ్లాలి అని ఆలోచన కూడా ఆ యువకుడికి రాలేదు. ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకొని చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు.



 కడుపు నొప్పి వచ్చింది అన్న కారణంతో యువకుడు క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుని  బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భైంసా మండలం సుంకులి  గ్రామానికి చెందిన రాజు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.  అంతకుముందు సెల్ఫీ వీడియో తీసి ఐ మిస్ యు ఫ్రెండ్స్.. నేను చనిపోతున్నాను అంటూ స్టేటస్ పెట్టాడు ఈ క్రమంలోనే అప్రమత్తమైన స్నేహితులు వెంటనే అతని ఇంటికి చేరుకునే సరికి అప్పటికే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రాజు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: