జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరిలించారు. ఎండీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. భైంసా మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదుల చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో... భైంసాలోని ఆటోనగర్ను వరద నీరు చుట్టుముట్టింది. భైంసాలోని ఆటోనగర్, ఎన్.ఆర్.గార్డెన్స్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు వంద కుటుంబాలను అధికారులు నాటు పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు. అటు వరదల్లో చిక్కుకున్న సుమారు 150 మందిని అగ్నిమాపక సిబ్బందిని గజ ఈతగాళ్లు, పోలీసులు రక్షించారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించారు. అటు వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు బయటకు రావద్దొన్ని సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్.
జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరిలించారు. ఎండీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. భైంసా మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదుల చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో... భైంసాలోని ఆటోనగర్ను వరద నీరు చుట్టుముట్టింది. భైంసాలోని ఆటోనగర్, ఎన్.ఆర్.గార్డెన్స్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు వంద కుటుంబాలను అధికారులు నాటు పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు. అటు వరదల్లో చిక్కుకున్న సుమారు 150 మందిని అగ్నిమాపక సిబ్బందిని గజ ఈతగాళ్లు, పోలీసులు రక్షించారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించారు. అటు వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు బయటకు రావద్దొన్ని సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్.