వామ్మో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి బీజీపీ నాయకురాలు శ్వేత రెడ్డి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని పై పికె ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతూ తమ ఆవేశాన్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పోసాని కృష్ణ మురళి మరియు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ గురించి అందరికీ తెలిసిందే. మహిళల సాధికారతదిశగా అంటున్న  పవన్ కళ్యాణ్ ను పాయింట్ ఔట్ చేస్తూ...బాబోయ్ మహిళల అభివృద్ధి గురించి వారి రక్షణ గురించి....మీరే మాట్లాడాలి..!! మరి మీరు పూనమ్ కౌర్ విషయంలో చేసింది ఏంటి?? దానికి న్యాయం ఎవరు చేస్తారు అంటూ అంటూ పోసాని, పవన్ ను ప్రశ్నించగా...ఈ విషయం పై పవన్ ఫ్యాన్ తీవ్రంగా మండిపడుతున్నారు. 

పోసానిపై దాడులకు సైతం దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే  తాజాగా ఈ అంశం పై  మాట్లాడిన బిజెపి నేత శ్వేత రెడ్డి పోసాని కృష్ణ మురళి కి సపోర్ట్ చేస్తూ పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఒక బాధ్యతగల వ్యక్తిగా   కృష్ణ మురళి రియాక్ట్ అయ్యారు. నా సపోర్ట్ పోసాని కృష్ణ మురళి గారికి అంటూ పేర్కొన్నారు. పికె ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ నిజాలు మాట్లాడితే బ్రతకనివ్వరా...ఎంతమందిని చంపుతారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? మస్తు చూసినాం ఇటువంటివి చంపడాలు, నరకడాలు అంటూ చురకలు వేశారు. ఇలాంటి బెదిరింపులు
నిజ జీవితంలో చూశారు. డైరెక్టర్ లు చూశారు...పోసాని గారు కూడా చూశారు....ఎవర్ని బ్లాక్ మెయిల్ చేస్తారు మీరు అంటూ పవన్ ఫ్యాన్స్ కి గట్టిగానే కౌంటర్లు వేశారు.


చిరంజీవి గారు పవన్ గారికి మీరైనా చెప్పండి మీరు  రాజకీయాల్లో ఎలా బోల్తా పడ్డారో ఆ విషయాన్ని ఆయన తమ్ముడికి వివరించమని పవన్ ని ఉద్దేశిస్తూ ఆమె మరో స్ట్రాంగ్ ఎలిమెంట్ తీశారు. అదేంటంటే నిజంగా దమ్ముంటే రాజకీయం చెయ్యి రాజకీయంలో ముందుకు పో, లేదంటే జనసేన పార్టీ అనే సూపర్ మార్కెట్ ను క్లోజ్ చేసి ఇంట్లో కూర్చోమని చెప్పండి అంటూ ఓ రేంజ్ లో పవన్ పై, పవన్ ఫ్యాన్స్ అంటూ వార్నింగ్ లు ఇస్తున్న వారిపై మాటల తూటాలు విసిరారు బిజెపి నాయకురాలు శ్వేత రెడ్డి. మరి దీని పై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: