ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి పంజాబ్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ పోటీపడి వాగ్దానాలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఎంత వ్యయమవుతుందన్నది అంచనాలకు అందని పరిస్థితి ఉందని విమర్శలు వస్తున్నా నేతలు వెనక్కు తగ్గడం లేదు. సంప్రదాయ పార్టీలతోపాటు ఆమ్ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో ముందుడటం విస్తుగొలిపే అంశం. నిజానికి దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొని ఉందన్నది వాస్తవం. ఉచిత పథకాల కారణంగా కొన్నిరాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ చేసిన వాగ్దానాలను మించి తాము ఉచిత పథకాలను ప్రకటించకపోతే ఎక్కడ వెనుకబడిపోతామోననే అనివార్య పరిస్థితుల్లోకి రాజకీయపార్టీలు చేరుకున్నాయి. దీంతో అభివృద్దిపై దృష్టి పెట్టకుండా అనుత్పాదక పథకాలకే ఓటు వేసే చెడు సంప్రదాయాలకు తెర లేచింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సుప్రీం నోటీసులకు కేంద్రం ఏవిధంగా స్పందిస్తున్నది రాజకీయ పార్టీల్లోనే కాక సామాన్య ప్రజల్లోను ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి పంజాబ్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ పోటీపడి వాగ్దానాలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఎంత వ్యయమవుతుందన్నది అంచనాలకు అందని పరిస్థితి ఉందని విమర్శలు వస్తున్నా నేతలు వెనక్కు తగ్గడం లేదు. సంప్రదాయ పార్టీలతోపాటు ఆమ్ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో ముందుడటం విస్తుగొలిపే అంశం. నిజానికి దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొని ఉందన్నది వాస్తవం. ఉచిత పథకాల కారణంగా కొన్నిరాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ చేసిన వాగ్దానాలను మించి తాము ఉచిత పథకాలను ప్రకటించకపోతే ఎక్కడ వెనుకబడిపోతామోననే అనివార్య పరిస్థితుల్లోకి రాజకీయపార్టీలు చేరుకున్నాయి. దీంతో అభివృద్దిపై దృష్టి పెట్టకుండా అనుత్పాదక పథకాలకే ఓటు వేసే చెడు సంప్రదాయాలకు తెర లేచింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సుప్రీం నోటీసులకు కేంద్రం ఏవిధంగా స్పందిస్తున్నది రాజకీయ పార్టీల్లోనే కాక సామాన్య ప్రజల్లోను ఉత్కంఠ రేకెత్తిస్తోంది.