మనదేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచింది. దీంతో ఈఎంఐ పెరిగింది. ఈ విధంగా చెయ్యడం వల్ల లోన్స్ తీసుకున్న వాళ్ళు తీవ్రంగా నష్ట పోతారని తెలుస్తుంది. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి పథకాలలో పెట్టుబడి పెట్టేవారు మాత్రం ప్రయోజనం పొందుతున్నారు. బ్యాంకులు ఎఫ్‌డీల పై వడ్డీ రేట్ల ను నిరంతరం పెంచుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 9, డిసెంబర్ 15 మధ్య FD వడ్డీ రేట్లను మూడు సార్లు పెంచింది.


కోటక్ మహీంద్రా బ్యాంక్ 2 కోట్ల రూపాయల లోపు ఎఫ్‌డిల పై వడ్డీ రేట్లను మళ్లీ పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు దేశీయ డిపాజిట్ల తో పాటు NRO, NRE డిపాజిట్ల పై వర్తిస్తాయి. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి నుంచి 390 రోజుల పాటు FD డిపాజిట్ల పై బ్యాంక్ 7 శాతం వడ్డీని చెల్లిస్తుంది. ప్రజలు 23 నెలల వరకు డిపాజిట్ల పై అదే వడ్డీని పొందుతారు. అదే సమయం లో సీనియర్ సిటిజన్ల కు ఎఫ్‌డీపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది..


కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లో 180 రోజుల వరకు FDలపై 5.75 శాతం వరకు వడ్డీ అందుబాటు లో ఉంది. ఇంతకుముందు బ్యాంక్ డిసెంబర్ 9, డిసెంబర్ 14 న FDల వడ్డీ రేట్లను పెంచింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ దేశంలో ని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు. దీనికి దేశ వ్యాప్తంగా 1600 కంటే ఎక్కువ శాఖలు, 2500 కంటే ఎక్కువ ఏటీఎంలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.. గతంలో క్రెడిట్ కార్డుల పై భారీ ఆఫర్ల ను ప్రకటించారు.. వీటితో పాటు మిగిలిన లోన్లపై కూడా భారీ ఆఫర్ ను ప్రకటించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: