ఇటీవల కాలంలో ఆన్లైన్ యుగం నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏది కావాలన్నా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెక్నాలజీని బాగా వాడుకుంటున్న జనాలు ఇక ఏదైనా కావాలంటే ఎక్కడికో బయటికి వెళ్లడం లేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ఒక క్లిక్ తో కావాల్సిన అన్ని వస్తువులను కూడా ఇంటి ముందుకు తెప్పించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే కాలంలో అటు ఆహారం కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తున్న కంపెనీలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


కాగా తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి తమకు నచ్చిన ఆహారాన్ని స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ ద్వారా ఆర్డర్ చేసి ఇక నిమిషాల వ్యవధిలో ఇంటిముందుకే డెలివరీ పొందుతూ ఉన్నారు  ఇలా ఇటీవల కాలంలో ఎంతో వేగంగా ఫుడ్ డెలివరీ చేయడానికి ఎన్నో రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి   ఇక ఇలా ఫుడ్ డెలివరీ కంపెనీలలో బాగా ఫేమస్ అయిన వాటిలో జొమాటో ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆకర్షణ ఏమైనా ఆఫర్లను ప్రకటిస్తూ ఇక తమ కష్టమర్ల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది జొమాటో కంపెనీ.



 ఇకపోతే ఇటీవల 2022 ఏడాది ముగిసిన నేపథ్యంలో ఇక జొమాటోలో బెస్ట్ కస్టమర్ ఎవరు అన్న విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కంపెనీ ప్రతినిధులు. ఈ క్రమంలోనే బెస్ట్ కస్టమర్ ఆర్డర్ చేసిన వివరాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఢిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తి ఈ ఏడాది అత్యధికంగా 3330 ఫుడ్ ఆర్డర్లు చేసినట్టు జొమాటో వెల్లడించింది. దీంతో అతనికి బెస్ట్ కస్టమర్ అవార్డును ప్రకటించింది. ఇక ముంబైకి చెందిన మరో వ్యక్తి యాప్ లో ప్రోమో కోడ్లను ఉపయోగించి ఏకంగా 2.43 లక్షలు సేవ్ చేశాడట. అంతేకాదు ఇండియాలో అత్యధికంగా నిమిషానికి 186 బిర్యానీలు, 139 పిజ్జాలను వినియోగదారులు ఆర్డర్ చేసినట్లు ఇటీవలే జొమాటో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: