హైదరాబాద్ షాద్నగర్ వైద్యురాలు దిశా ఘటన  దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలుసిందే . రాక్షసుల్లాంటి  నలుగురు నిందితులు అమాయకపు వైద్యురాలిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ ప్రజానీకాన్ని కలచివేసింది. ఎట్టి పరిస్థితుల్లో రేప్ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడేలా కోర్టు తీర్పును ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది దేశ ప్రజానీకం. అటు దిశా ఘటనపై దేశంలోని సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరు స్పందిస్తూ  ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కాక దేశమంతట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత దేశంలోని ప్రజలందరూ విశాఖపట్నంలో నిందితులకు కఠిన శిక్ష పడాలని మరోసారి ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

 

 

 అయితే దేశంలోని ప్రజలందరూ దిశకు జరిగిన ఘటన గురించి తెలుసుకొని బాధపడుతుంటే  నిజాంబాద్ కు చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి మాత్రం దిశా ఘటన పై దారుణంగా కామెంట్ చేశారు. అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో  తప్పంతా దిశాదే  అని నిందితులకు సపోర్ట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు నిజాంబాద్ కు చెందిన శ్రీరామ్. కాగా ప్రస్తుతం శ్రీరామ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అయితే దిశగా ఘటనపై అతి దారుణంగా కనీసం మానవత్వం మరిచి కామెంట్ చేసిన నిజామాబాద్కు చెందిన శ్రీరామ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. 

 

 

 

 శ్రీరామ్ వ్యాఖ్యలపై దేశం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సిగ్గు లేదారా నీ అక్కకో  చెల్లికో  ఇలా జరిగితే ఊరుకుంటావా అంటూ చాలా మంది శ్రీరామ్  వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అమాయకురాలైన   ఆడపిల్లను నలుగురు కామాంధులు అత్యాచారం చేసి హత్య చేస్తే నిందితులది తప్పు కాదు  ఆ అమ్మాయిది  తప్పు అంటూ కామెంట్ చేయడం పై శ్రీరామ్ పై  ఘాటుగా స్పందిస్తున్నారు ప్రజలు. కాగా ప్రస్తుతం దిశా ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రామ్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరామ వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీరామ్ దిశా  ఘటన పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అలెర్ట్  అయిపోయారు.కాగా  అయితే దిశగా ఘటనపై వీ  వాంట్  జస్టిస్  అంటూ ఇంకా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: