బ్యాంకులన్ని తమ తమ ఖాతాదారులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్ను ప్రకటిస్తుంటాయన్న విషయం తెలిసిందే. క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఆఫర్లు ఇంకా ఎక్కువ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి బ్యాంకులు . అయితే దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది . ఏకంగా ఏడు వేల రూపాయల ఓచర్ ఖాతాదారులకు అందించేందుకు నిర్ణయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకీ ఏడు వేల రూపాయలు వోచర్ ఎవరికోసం అనుకుంటున్నారా... కేవలం క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్లకి మాత్రమే. ఇక ఆ క్రెడిట్ కార్డు కూడా ఎస్బిఐ యునో ఫెస్టివల్ షాపింగ్ లో భాగంగా ఎస్బిఐ తన ఖాతాదారులకు ఆఫర్ ప్రకటించింది. ఎస్బిఐ యోనో ఫెస్టివల్ షాపింగ్ లో భాగంగా ఎస్బిఐ ఖాతాదారులకు క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటే వారికి ఓ సూపర్ ఆఫర్ అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నారు అంటే ఏకంగా ఎస్బిఐ ఏడు వేల రూపాయల విలువైన ఓచర్ ఉచితంగా అందిస్తోంది. అయితే ఇది క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకున్న వారందరికి అందుబాటులో ఉండదు.. కేవలం ఎస్బిఐ యోనో ప్లాట్ఫాం ద్వారానే క్రెడిట్ కార్డు అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఏడు వేల రూపాయల విలువైన ఓచర్లను పొందడానికి అవకాశం కలిపించింది బ్యాంకింగ్ దిగ్గజం సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. స్టేట్ బ్యాంక్ యోనో షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆఫర్ డిసెంబర్ 14 తో అంటే ఈ రోజుతో ముగియనుంది. అంటే ఎస్బిఐ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
.
ఈ ఆఫర్ పొందాలి అనుకునేవారు వెంటనే క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మర్చిపోకుండా స్టేట్ బ్యాంక్ యు నో ప్లాట్ఫాం ద్వారా క్రెడిట్ కార్డు అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ పొందవచ్చని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా అటు ఆన్లైన్ షాపింగ్ లో కూడా అద్భుత ఆఫర్లు అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ లో ఏదైనా కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు పై 5 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించనుంది. ఇక టాప్ 100 స్పెండర్ కి కూడా వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ఇంకెందుకాలస్యం కొన్ని గంటల్లో కి ఆఫర్ అయిపోనుంది వెంటనే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోండి.