ప్రేమ అనేది ఎంత పవిత్రమైనది.. రెండు మనసుల కలయికతో ఈ ప్రేమ మొదలయ్యి వివాహబంధంతో దాంపత్య జీవితానికి ముడి వేస్తుంది. అందుకే ప్రేమను పూర్తిగా తెలుసుకోవాంటే ప్రేమలో పడాలని చాలా మంది అంటుంటారు. ఇకపోతే కొన్నీ అనివార్య కారణాల వల్ల ఆ బంధం పెళ్లివరకు వెళ్లలేక పోతే గుండెల్లో భాద ఉన్నా కూడా ప్రేమించిన వారి సంతోషం కోసం అన్నీ వదిలేస్తారు. 

 


అయితే ఈ సంఘటన మాత్రం కొంచం వెరైటీగా ఉంది. వాళ్లిద్దరూ విడిపోయారు. ఆమెకు వేరే అతనితో వివాహం జరిగింది. అయితే, ప్రశాంతంగా తన భర్తతో కాపురం చేసుకుంటూ ఒక కొడుకును కూడా కన్న తర్వాత కూడా అతను ఆమెపై మోజుతో కలవాలని తన కొడుకును కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఏమైంది. కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులకు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న భార్యకి తెలిసిన వ్యక్తే కొడుకుని కిడ్నాప్ చేసినట్లు తెలియడంతో అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు.

 

ఘజియాబాద్‌లోని కృతి విహార్‌కి చెందిన రోషిణీ దేవికి ఫరూఖాబాద్‌కి చెందిన ముకేష్ కుమార్‌తో 2008లో వివాహమైంది. వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె పిల్లలతో సహా ఘజియాబాద్‌లోని పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలసి నివాసముంటోంది. ఆమె నాలుగేళ్ల కొడుకు ఆడుకుంటానని చెప్పి బయటికి వెళ్లాడు. 

 


వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉన్న ఆమె ప్రియుడికి దగ్గరగా ఉంది. అతిని నుండి విడిపోయిన తర్వాత పుట్టింట్లో ఉండేది. అయితే ఆమె ఇంటి పక్కన వికాస్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇంటిని చుట్టుముట్టి అతని నుంచి ఆమె కొడుకుని రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఎలాగైనా రోషిణీని తన కోరికలను తీర్చుకోవడానికి రప్పించాలని ఇలానే చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమికుల్లారా జరా జాగ్రత్త సుమీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: