మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు లైంగిక వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మహిళలకు లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు. దేవాలయం లాంటి పాఠశాలలకు కళాశాలలకు వెళ్లినా మహిళలకు అక్కడ లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు విద్యాబుద్దులు నేర్పే గురువులకు  లైంగిక వేధింపులు ఎదురైతే కొన్నిసార్లు తోటి విద్యార్థుల నుండి  లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఓ విద్యార్థికి ఇలాంటి ఘటనే జరిగింది.. కళాశాల అన్న తర్వాత విద్యార్థుల మధ్య స్నేహం చిగురించడం సహజం. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు యువతితో స్నేహం పెంచుకున్నాడు. ఇక స్నేహమే కదా అని సరే చెప్పిన యువతితో... ప్రతిరోజు వెంట పడటం మొదలు పెట్టాడు. తనతో బయటికి కూడా రావాలంటూ అడిగేవాడు. ఆ యువతి అలాంటివి ఇష్టముండదని చెప్పింది. తనతో స్నేహం అంటే హాయ్ బాయ్ అంతవరకే అంటూ క్లారిటీ ఇచ్చింది. 

 

 

 ఇక ఆ తర్వాత స్నేహం ముసుగులో మా అమ్మ నిన్ను చూడాలని ఉంది వస్తావా మా ఇంటికి అంటూ  మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం  చేశాడు. వివరాల్లోకి వెళితే... వరంగల్ అర్బన్ జిల్లా అయినవోలు మండలం  జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇద్దరు  విద్యార్థుల మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ యువకుడు ఆ యువతిపై ఎలాగైనా కామ వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. సినిమాలకు షికార్లకు రావాలి అని పిలవడంతో ఆ యువతి నిరాకరించడంతో... మరో ప్లాన్ వేసాడు. మా అమ్మ నిన్ను ఒకసారి చూడాలని ఉందని లడ్డూలు ఇస్తానంది అని నాతో పాటే తీసుకురావాలి అని చెప్పింది అంటూ నమ్మబలికి ఇంట్లో కి తీసుకెళ్ళాడు. 

 

 

 ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాక అమ్మ ఎక్కడుందో రూమ్లో చూడు అని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ యువతి బెడ్రూంలోకి వెళ్ళగానే ఇంటి తలుపులు పెట్టి... వద్దు ప్లీజ్ అంటూ ఆ యువతి బతిమిలాడిన  అత్యాచారం చేశాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన యువతి.. ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని  చెప్పి కన్నీరుమున్నీరైనది . ఇక ఇదే విషయాన్ని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కేసు పెట్టారు. పోలీసులు ఆ యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా... ఈ కేసులోని బాధితురాలు నిందితుడు ఇద్దరు మైనర్ కావడంతో పోలీసులు అందుకు తగిన చట్టం కింద దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: