ప్రేమ ఒక మధురానుభూతి ప్రేమ ఎన్నో జ్ఞాపకాలకు ఒక చిరునామా. కానీ నేటి తరం ప్రేమను ఎలా మారుతున్నాయి అంటే ఒక అమ్మాయిని ప్రేమించటం..కాదు అంటే  యాసిడ్ దాడులు చేస్తున్నారు. ఇక ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది... కొన్నాళ్లపాటు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఇంతలో వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది యువతీ.  దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు కూతురు రక్తపుమడుగులో శవమై కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా సయద్ సరవాన్ గ్రామానికి చెందిన యువతి పొరుగునే ఉన్న ఫతేపూర్ జిల్లాకు చెందిన చోట్క  అనే యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు గానీ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేశారు. ఈ క్రమంలోనే ఆ యువతి నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిశ్చితార్థానికి ముందు జరిగే ఓ కార్యక్రమంలో కోసం యువతిని ఒంటరిగా ఇంట్లో ఉంచి వరుడి ఇంటికి వెళ్లారు కుటుంబ సభ్యులు. ఇక తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరికి దక్కబోతోంది అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు  ఆ యువకుడు. దీంతో ఆ యువతిని చంపటానికి  నిర్ణయించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నేరుగా ఇంటికి వచ్చాడు. 

 

 

 ప్రియురాలి గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అయితే ఒక్కసారిగా గొంతు పోవడంతో ఆ యువతి సోఫాలో కుప్పకూలిపోయింది. దీంతో ప్రియురాలు లేని జీవితం తనకు ఎందుకు అనుకున్నాడో ఏమో అదే గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ యువకుడు. ఇక కార్యక్రమం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు... తలుపు కొట్టిన ఎంతకీ కూతురు తలుపు తీయకపోవడంతో కంగారుపడి తలుపులు బద్దలు కొట్టారు. ఇక లోపలికి వెళ్లి చూసి షాక్  అయ్యారూ  తల్లిదండ్రులు. అంతే కాకుండా మరో యువకుడు ఫ్యాన్కు ఉరివేసుకొని ఉండడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: