టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత... పూర్తిగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా మరోసారి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ హిట్ మూవీ అయినా పింక్ రీమేక్ తో  తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం పింక్ మూవీ ఒకటే కాకుండా వరుసగా నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాల్లో  రెండు ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాయి. మిగతావి ప్రీ  ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే  పనులు ఉన్నాయి. ప్రస్తుతం రెండు సినిమాల చిత్రీకరణ శరవేగంగా  జరుపుకుంటుంది. బాలీవుడ్ హిట్ మూవీ అయిన పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం దీనికి వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 

 దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.  తాజాగా ఒక ప్రోమో సాంగ్ కూడా విడుదలై  ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్  గా మారిపోయింది. ఇక రెండో చిత్రం క్రిష్ దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో ఉత్తమ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సముద్రంలో ఓడలో  తరలిపోతున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ప్రయత్నం చేసే ఫైట్ ... పవన్ పై చిత్రీకరిస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఈ ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది టాక్ వినిపిస్తుంది. అయితే ఇంకో వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫైట్  చిత్రీకరించడానికి ఒక పాపులర్ గేమ్ షో ప్రేరణ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. షాడో ఫైటర్ అనే  వీడియో గేమ్  ప్రేరణ పొంది ఈ భీకర పోరాటం చిత్రీకరించారట. 

 

 ఇక ఈ ఫైట్ సినిమా లోని హైలెట్ గా  మారనుందని...  అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తుందట ఈ ఫైట్ సీన్. ముఖ్యంగా ఈ ఫైట్ సీన్స్ పవన్ కళ్యాణ్ సాహసాలు అని ఒళ్లు గగుర్పొడిచేలా చిత్రీకరిస్తున్నారట దర్శకుడు క్రిష్. అంతే కాదు సినిమా బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నట్లు  సమాచారం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో అభిమానులు ఈ ఫైట్ సీన్ కు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: