ఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది. మానవత్వం కరువై మనుషుల ప్రాణాలను గాల్లో కల్పిస్తున్న వారు  కొంతమంది అయితే.. కామంతో కళ్లు మూసుకుపోయి అతి దారుణంగా అత్యాచారం చేసి మనుషుల ప్రాణాలు బలి తీసుకునే వారూ  కొంతమంది. వెరసి రోజురోజుకు మనిషి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. రోజురోజుకు మనుషులు మానవత్వాన్ని మరిచి పోయి మరి అతి దారుణంగా సాటి మనుషుల ప్రాణాలను హరిస్తున్నారు. ఇక కామందులు అయితే రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కామాంధులకు ఎంత కఠిన శిక్షలు విధించినా ఎక్కడ భయం మాత్రం  కనిపించడం లేదు. 

 

 

 

 ఇక్కడ ఇద్దరు మానవమృగాలు అతి దారుణంగా ఓ వ్యక్తి ప్రాణాలు బలి ఉన్నారు. కామంతో ఊగిపోయి ఏకంగా ఒక వ్యక్తిని  హత్యచేసి శవంతో కామవాంఛ తీర్చుకున్నారు మనుషుల రూపంలో ఉన్న క్రూర  మృగాలు. వారి మధ్య  చోటు చేసుకున్న గొడవ కారణంగా ఇంత దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరిని గగుర్పాటుకు గురిచేస్తుంది. దక్షిణ ఢిల్లీలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్బీహార్ లకు చెందిన ఇద్దరు వ్యక్తులు... దక్షిణ ఢిల్లీలోని నేబ్  సరై ఏరియా లో ఉంటున్నారు. వారికి అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 

 

 

 

 ఇక మంగళవారం ఆ వ్యక్తి ఇంట్లో ముగ్గురు కలిసి మందు పార్టీ జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరికీ అతడితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన ఇద్దరు  అతని గొంతు నులిమి దారుణంగా చంపేశారు. అనంతరం శవంతో కామవాంఛ తీర్చుకున్నారు మానవ మృగాలు. ఇక ఆ రాత్రి కామవాంఛ తీర్చుకొన్నాక  శవాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన ఆ ఇద్దరు బుధవారం ఉదయం మళ్లీ ఇంటికి వచ్చారు. ఆ శవాన్ని ఎవరికీ కనబడకుండా తరలిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ మృతుని సోదరి కంట పడ్డారు. ఇక వీరిని చూసి ఒక్క సారిగా భయపడిపోయిన ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక షాక్  నుండి తేరుకున్న సదరు యువతి సోదరుడు దారుణ హత్య పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దారిలో ఉన్న నిందితులను పాట్నా లో అదుపులోకి తీసుకున్నారు. గొడవ  కారణంగానే బాధితున్ని  చంపేసినట్లు విచారణలో అంగీకరించారూ  నిందితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: