రాయలసీమ కడపజిల్లాలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు దర్శనమిస్తున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కొండరామస్వామి దేవాలయం... పుష్పగిరి, గండి మహా క్షేత్రం, సౌమ్యనాథ దేవాలయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మహిమలున్న ప్రముఖ దేవాలయాలు కనిపిస్తాయి. అందుకే  కడపకు చాలా ప్రత్యేకత ఉంది.. ఇకపోతే కడపలో ప్రసిద్ధి దేవాలయం అంటే ప్రముఖ దేవాలయం ఉంది. ఆ దేవాలయము ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం.. 

 

 


ఈ దేవాదాలయం ప్రపంచంలోకి పెద్ద దేవాలయం..కేవలం ఇద్దరు మాత్రమే ఈ దేవాలయాన్ని నిర్మించారని ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి. ఒంటిడు, మిట్టాడు అనే ఇద్దరు స్నేహితులు ఈ దేవాలయాన్ని నిర్మించారట. ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని ప్రత్యేకతలు ఈ దేవాలయంలో ఉన్నాయట .. అందుకే ఎక్కడికి పర్యాటకుల సందడి కూడా ఎక్కువే. . 

 

 


ప్రతి ఏటా శ్రీనామనవమి రోజు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తొమ్మిద రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ తొమ్మిది రోజులు ఒక్కో వాహనం పై స్వామివారు ఒంటిమిట్ట పురవీధుల్లో ఊరేగింపు గా దర్శనమిస్తారు. ఆ దృశ్యాన్ని చూడటానికి భక్తులు చాలా మంది అక్కడకి వస్తుంటారు. అలా లక్షల మంది శ్రీరాముణ్ణి దర్శించుకుంటూ స్వామివారిని దర్శించుకుంటారు. అది ఆ ఆలయ ప్రత్యేకత... ఇప్పుడు ఏకంగా ఆంద్రప్రదేశ్ భద్రాచలం గా పిలవబడుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ కార్యక్రమాలు జరగుతున్నాయి.  

 

 


ఈ దేవాలయ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే రోజు అంటే చివరి రోజు.. అదే పాన్పు సేవ.. ఈ రోజు అంటే స్వామివారికి, సీతామాతకు ఏకాంతకైనా రోజు. అంగరంగ వైభవంగా ఈ రోజును నిర్వహిస్తారు. అందుకే ఈరోజును ఎన్నో రకాల ఫల పుష్పాలను పెడతారు. అందులో ముఖ్యంగా కనిపించేవి రక రకాల ద్రాక్షపండ్లు. అమ్మవారికి ఈ పండ్లు ఇష్ట కావడంతో వీటిని ఉంచుతారు. అంతేకాకుండా జీడీ పప్పు కూడా ఉంచడం విశేషం ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ దేవాలయాన్ని ఒక్కసారైనా సందర్శించండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: