తన భర్త ప్రాణాలు కాపాడడానికి ఇక్కడ ఒక మహిళ చేసిన సాహసానికి ఏకంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. మావోయిస్టుల చెరలో చిక్కుకున్న భర్తకోసం... ఆ మహిళ పడిన కష్టానికి అందరూ నివ్వెరపోతున్నారు. ప్రాణాలకు తెగించి మరీ తన భర్త కోసం... తన భర్తను రక్షించడానికి ఎంతో సాహసం చేసింది ఆ మహిళ. తన భర్త కానిస్టేబుల్ గా  పనిచేస్తున్నాడు... అయితే మావోయిస్టులు కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన భర్త ని కిడ్నాప్ చేసారు . దీంతో అందరిలా ఏడుస్తూ కూర్చోలేదు ఆ మహిళ. ఎంతో ధైర్యం చేసి అడవిలోకి వెళ్ళింది. భర్తను ఎలాగైనా ఇంటికి తీసుకు రావాలని అనుకున్నది . చివరికి అనుకున్నది సాధించింది. 

 

 

 తన భర్తను కాపాడేందుకు ఓ మహిళ ఏకంగా నాలుగు రోజుల పాటు అడవినీ జల్లెడ పట్టిన ఘటన ఛత్తీస్ ఘడ్ లోని  భూపాలపట్నం స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మామూలుగానే మావోయిస్టులు పోలీసులను అపహరించుకు పోయి పలు డిమాండ్లు నెరవేర్చు కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సంతోశ్ ను ఈ  నెల ఆరవ తేదీన మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇక తన భర్తను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు అని తెలిసిన భార్య మొదట ఆందోళన చెందిన  ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుంది. 

 

 

 తన భర్తను ఎలాగైనా కాపాడాలని భావించింది.. దీంతో తన పద్నాలుగేళ్ల కూతురు సహా కొంతమంది స్థానికులతో ఒక  జర్నలిస్టులతో కలిసి ఏకంగా అడవిలోకి పయనమైంది ఆ మహిళ. నాలుగు రోజుల పాటు అడవినీ జల్లెడ పట్టిన. ఇక ఎంతకీ మావోయిస్టుల జాడ మాత్రం తెలియడం లేదు. అందరూ సదరు వ్యక్తి గురించి ఆశలు వదిలేసుకున్నప్పటికీ ఆ మహిళ మాత్రం పట్టుదలతో ముందుకు సాగింది. నాలుగవ రోజు తర్వాత మావోయిస్టుల బృందం వీరికి కనిపించింది. ఇక సునీత అనే సదరు మహిళ పట్టుదల స్థానికుల ఒత్తిడి కారణంగా మావోయిస్టులు కానిస్టేబుల్గా పనిచేస్తున్న సంతోష్ ను  విడిచిపెట్టారు. ఇక మహిళా  అయ్యుండి కూడా భర్తను కాపాడుకోవడానికి ఆమె చేసిన సాహసానికి అందరూ అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: