ప్రస్తుతం భారత దేశం పై నేపాల్ ప్రధాని వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కు సంబంధించి భారత దేశం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. అంతేకాకుండా భారత్లోని పలు భూభాగాలను నేపాల్ లో ఉండేలా అధికారికంగా ఒక మ్యాప్ విడుదల చేయడం లాంటివి చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు నేపాల్ ప్రధాని. ప్రస్తుతం నేపాల్ ప్రధాని అంశం భారత్ లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగి ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న మనీషా కొయిరాలా.. ఈ వివాదం  గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి  విమర్శల పాలవుతోంది. 

 


 వాస్తవంగా  అయితే మనిషా కొయిరాల భారత చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు పొందింది. అయితే మనిషా కొయిరాల నేపాల్ దేశంకి చెందింది . దీంతో తనకు స్వదేశం పై ఉన్న ప్రేమను మనిషా కొయిరాల ప్రదర్శించింది . కానీ ప్రస్తుతం భారత ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటుంది మనిషా కొయిరాల. ఇంతకీ మనిషా కొయిరాలా ఏమన్నది అంటే.. నేపాల్ వ్యవహారంపై స్పందించారు మనీషా కొయిరాలా.. నేపాల్ ప్రధాని వాక్యాలన్ని సమర్థిస్తూ.. మూడు దేశాల మధ్య సహృద్బావ చర్చలు  జరగాలని కోరుకుంటున్నాను అంటూ కొన్ని కామెంట్లు చేసింది. దీంతో భారత ప్రజానీకం మనిషా కొయిరాల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. 

 

 నువ్వు బాగా పాపులర్ అయింది భారతదేశంలో.. ప్రస్తుతం భారత దేశపు తిండి తింటూ నేపాల్  గురించి గొప్పగా మాట్లాడతావా అంటూ భారత ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటుంది ప్రస్తుతం మనీషా కొయిరాలా. అయితే ప్రస్తుతం మనీషా కొయిరాలా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ నేపాల్ దేశం వైపు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మనిషా కొయిరాల తన వ్యాఖ్యలతో రెండు పడవల ప్రయాణం మొదలుపెట్టింది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రస్తుతం నేపాలి పై దేశభక్తి చూపెడితే .. మనిషా కొయిరాల కు కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో దేశ భక్తి మరుచి  భారత్ను పొగిడితే ఒకవేళ నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఛీత్కారాలు ఎదురయ్యే  అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీంతో తన వ్యాఖ్యలతో వివాదంలో ప్రవేశించి రెండు పడవల ప్రయాణమే మనిషా కొయిరాల మొదలు పెట్టింది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: