భార్య భర్తల బంధం అంటే నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ ఎంతో అందంగా ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతుంది. కొంతమంది కట్టుకున్న వారిని మోసం చేసి అక్రమ సంబంధాలకు తెరలేపుతుంటే...  ఇంకొంత మంది అదనపు కట్నం కోసం ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా అదనపు కట్నం కోసం భార్యను వేధించడం చిత్రహింసలకు గురి చేయడం లాంటి ఘటనలు అయితే ఈ రోజుల్లో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి దారుణం ఘటన జరిగింది. అదనపు కట్నం కోసం ఏకంగా భార్యను పాముతో  కాటు వేయించి  దారుణంగా చంపాడు భర్త. 

 

 ఘటన కేరళ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోన కొల్లం జిల్లా అంచల్ కి  చెందిన ఓ ప్రైవేటు బ్యాంకులో  పని చేస్తున్నాడు. ఇక అతనికి ఉతారా  అనే మహిళతో  రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. మొదట  అన్యోన్యంగా సాగిపోయిన వీరి కాపురంలో కొద్ది రోజుల నుంచి కలతలు  మొదలయ్యాయి . అదనపు కట్నం కోసం సూరజ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇక తన భార్య కుటుంబం ఆర్థికంగా ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం లేకపోవడంతో తన భార్యను హత్య చేయాలని భావించాడు. హత్య తనపైకి రాకుండా ఉండేలా పథకం పన్నాడు. ఈ క్రమంలోనే తనకు తెలిసిన సురేష్ అనే పాములు పట్టే వ్యక్తిని సంప్రదించి రెండు పాములను పదివేల రూపాయలు వెచ్చించి కొన్నాడు. ఇదే సమయంలో ఓ రోజు తన భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమె పైకి ఒక పామును వదలగా  అది కాటు వేసింది. 


 ఇక వెంటనే తేరుకున్న ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోగా వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయ  స్థితి నుంచి బయట పడింది. ఆ తర్వాత మరోసారి మే 7వ తేదీన నిద్రపోతున్న తన భార్యపై మరో సారి పాముని వదిలేశాడు. ఈసారి పాముకాటుకు ఉతారా ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. భార్య ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాముని చంపి ఏం  ఎరగనట్లు ఆ ఇంట్లోనే  ఉంటున్నాడు భర్త సూరజ్. అతని ప్రవర్తనపై అనుమానం కలిగిన భార్య  తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు భర్త ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా... చివరికి నిజాన్ని అంగీకరించాడు భర్త.

మరింత సమాచారం తెలుసుకోండి: