ప్రేమంటే ఎన్నో మధురానుభూతులను ఇస్తుంది... ఎన్నో తీపి  జ్ఞాపకాలు  జీవితానికి అందిస్తుంది ... కానీ నేటి తరంలో ప్రేమలు  మాత్రం కేవలం విషాదంతో ముగుస్తున్నాయి. ప్రేమలో  చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడడం.. ప్రేమించిన వారిని పెళ్లి వదులుకోలేక  పెద్దలను ఎదిరించలేక చివరికి తనువు చాలించడం లాంటి ఘటనలు ఎక్కువైపోయింది. ప్రేమజంట ఆత్మహత్య లు ఎన్నో కుటుంబాల్లో  తీరని శోకాన్ని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా జరిగిన ఘటన రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

 ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల లో చోటు చేసుకుంది  . వివరాల్లోకి వెళ్తే... శ్రీరాంపూర్ చెందిన మల్లిక రామకృష్ణ పురానికి చెందిన సంతోష్  ఓకే జూనియర్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య స్నేహం  చిగురించింది. తర్వాత ఇద్దరూ పాసై ఉన్నత విద్య నిమిత్తం డిగ్రీ లో చేరారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా డిగ్రీలో ప్రేమగా మారి పోయింది. కొన్ని రోజుల వరకు వీరి ప్రేమను కాస్త రహస్యంగానే ఉన్నప్పటికీ చివరికి వీరి విషయం ఇంట్లో తెలిసిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం వీరిని ఏమి అనలేదు. అయితే గత కొన్ని నెలల క్రితం సంతోష్ చదువు మానేసి ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. 

 


 ఇదే సమయంలో ఆన్లైన్ గేమ్స్ కోసం ఊర్లో చాలానే అప్పులు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఓ రోజు ఏకంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు సంతోష్. ప్రియుడి  మరణాన్ని తట్టుకోలేక పోయింది మల్లిక. జీవితం మొత్తం తన ప్రియుడితో నే అని అనుకున్న మల్లిక సంతోష్  లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. అదే ఆలోచనలో ఉన్న మల్లికకు  కాస్త ఉపశమనం నిమిత్తం వారి బంధువుల ఇంటికి తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక బంధువుల ఇంటికి ఆటోలో ప్రయాణం అవుతుండగా ఇందారం గోదావరి బ్రిడ్జి పైకి ఆటో చేరుకుంది. దీంతో వెంటనే ఆటోలోంచి దూకిన మల్లిక గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: