మరోసారి బాలయ్య వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ లో బాలయ్య దుమారం చెలరేగుతోంది. ఇంకా ఆ వివాదం సర్దుమణగక ముందే ఇప్పుడు మరోసారి బాలయ్య వార్తల్లోకి ఎక్కారు. అయితే ఆయన ఆ వివాదాన్ని చక్కదిద్దుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే ఆయనపైన ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అని గతంలోనే డాక్టర్లు చెప్పారని, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మీడియా సమావేశంలో చెప్పడం కలకలం రేపింది. బాలకృష్ణ మానసిక పరిస్థితిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.

IHG


 అసలు బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా అనర్హుడని, బాలయ్య వ్యవహార శైలితో హిందూపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ అంటే తమ అందరికి ఎంతో గౌరవం , అభిమానం ఉందని, కానీ ఆయన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడితో కలిసి ఆ పార్టీలో ఉంటూ బాబు ని బాలకృష్ణ భుజాన వేసుకుని మోస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చచ్చిన పాము వంటి వారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

 జగన్ ఏడాదిలోనే దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, మొదటి ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించి జగన్ మంచి పేరు తెచ్చుకున్నారని, రాబోయే నాలుగేళ్లలో ఇదే తరహాలో అద్భుతాలు సృష్టించి మరింత మంచి పేరు తెచ్చుకుంటారని ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు కి ఏ పనీ లేకనే జూమ్ లో పార్టీ కార్యక్రమాలు నడిపించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: