వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు లో వెలుగు చూసింది. ఈ ఘటన పుంగనూరు సమీపంలో జరిగింది. జిల్లాలోని రొంపిచెర్లకి చెందిన వేణుగోపాల్ తన లారీలో టమోటా లోడుతో పుంగనూరు మార్కెట్ నుంచి చెన్నైలోని కోయంబేడు మార్కెట్కి బయల్దేరాడు. పలమనేరు రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద ఆర్టీవో అధికారులమంటూ ముగ్గురు దుండగులు లారీని అడ్డగించారు. తర్వాత కత్తులతో డ్రైవర్ ను బెదిరించి టమోటా లతో పాటుగా లారీని కూడా తీసుకెళ్లారు.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. లారీతో సహా పరారైన దోపిడీ దొంగలు పారిపోయే క్రమంలో వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారు. వేగంగా లారీని నడపటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. లారీ కోసం వెళుతున్న పోలీసులకు లోడు తో ఉన్న లారీ బోల్తా కొట్టిందని తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పరిశీలించారు. పల్టీలు కొట్టడం తో లారీని అక్కడే వదిలేసి దొంగలు పారిపోయారు. పుంగనూరు సీఐ గంగిరెడ్డి స్పాట్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి