తనను బ్లాక్ మెయిల్ చేసి కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్న నీచుడి పై భద్రకాళి గా మారిన మహిళ ఏకంగా దారుణంగా నరికి చంపిన ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలని చూపించి 15 సంవత్సరాలుగా మహిళపై ఓ వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పడుతున్నాడు. దీంతో ఏకంగా బాధితురాలు కామందున్ని నరికి చంపిన ఘటన మధ్య ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. భూపాల్ కి 200 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండే మహిళలకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2005 సంవత్సరంలో ఒక కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైంది సదరు మహిళ. ఆ కిరాతకుడు అదంతా వీడియో కూడా తీశాడు.
ఇక అప్పటినుంచి ఆ నీచుడు వీడియో బయటపెడతానని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతు సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పెళ్లయి పిల్లలు ఉన్న సదరు మహిళ విషయం బయటపడితే పరువు పోతుంది అని భావించి... ఇక సదరు కామాంధుడికి ఎదురు చెప్పలేక పోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో సదరు నీచుడు మరోసారి మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అతని తీరుతో విసిగి పోయిన మహిళ ఏకంగా కత్తితో అపర కాళిలా అతనిపై తిరగబడింది. కసితీరా 25 సార్లు పొడిచి దారుణంగా నరికి చంపింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది.