ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే ఏకంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు  రోజురోజుకు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. స్నేహితుల మధ్య తలెత్తిన చిన్నచిన్న గొడవలు ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంతవరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. రోజు రోజుకు తెర  మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో  జాలి దయ ఉన్న మనుషులు కరువైపోయి ఉన్మాదులుగా   మారుతున్న వారు ఎక్కువవుతున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. చిన్నచిన్న కారణాలకే ఏకంగా దారుణ హత్యలకు పాల్పడుతున్న  ఘటన వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.


 తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 15 వేల రూపాయల నగదు చుట్టూ అల్లుకున్న వివాదం ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకునెంతవరకు  వెళ్ళింది. ఈ దారుణ ఘటన తెనాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన సుభాని అనే 24 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.. ఇటీవలే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తన స్నేహితుడైన రఫీ దగ్గర 15 వేల అప్పు గా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత రఫీ తన అప్పు చెల్లించాలని పలుమార్లు అడిగినప్పటికీ సుభాని మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇటీవలే అప్పు చెల్లించని నేపథ్యంలో సుభాని యొక్క  ద్విచక్రవాహనాన్ని లాక్కుని దాన్ని తాకట్టు పెట్టుకున్నాడు రఫీ.



 ఇక అక్కడి నుంచి మొదలైన వివాదం ఏకంగా ఒకరి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది. తన ద్విచక్ర తాకట్టు పెట్టుకోవడంతో సుభాని ఏకంగా రఫీ తో  మాటల యుద్ధానికి దిగాడు. ఒకరినొకరు చంపేస్తామంటూ బెదిరించు కున్నారు కూడా. ఈ క్రమంలోనే సుభాని ఎక్కడ తనపై దాడి చేసి ప్రాణాలు తీస్తాడో  అని భయపడి పోయిన రఫీ ఏకంగా తన స్నేహితులతో కలిసి సుభాని ని  హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ ఈ క్రమంలోనే బార్ కి పిలిచి మద్యం తాగించి అర్ధరాత్రి సమయంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఇక ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రఫీ అతని స్నేహితుని  అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: