తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 15 వేల రూపాయల నగదు చుట్టూ అల్లుకున్న వివాదం ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకునెంతవరకు వెళ్ళింది. ఈ దారుణ ఘటన తెనాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన సుభాని అనే 24 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.. ఇటీవలే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తన స్నేహితుడైన రఫీ దగ్గర 15 వేల అప్పు గా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత రఫీ తన అప్పు చెల్లించాలని పలుమార్లు అడిగినప్పటికీ సుభాని మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇటీవలే అప్పు చెల్లించని నేపథ్యంలో సుభాని యొక్క ద్విచక్రవాహనాన్ని లాక్కుని దాన్ని తాకట్టు పెట్టుకున్నాడు రఫీ.
ఇక అక్కడి నుంచి మొదలైన వివాదం ఏకంగా ఒకరి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది. తన ద్విచక్ర తాకట్టు పెట్టుకోవడంతో సుభాని ఏకంగా రఫీ తో మాటల యుద్ధానికి దిగాడు. ఒకరినొకరు చంపేస్తామంటూ బెదిరించు కున్నారు కూడా. ఈ క్రమంలోనే సుభాని ఎక్కడ తనపై దాడి చేసి ప్రాణాలు తీస్తాడో అని భయపడి పోయిన రఫీ ఏకంగా తన స్నేహితులతో కలిసి సుభాని ని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ ఈ క్రమంలోనే బార్ కి పిలిచి మద్యం తాగించి అర్ధరాత్రి సమయంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఇక ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రఫీ అతని స్నేహితుని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.