దామగుండంలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ఆమె బంధువులకు ఫామ్ హౌస్ లు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. కాగా ఆ ఫామ్ హౌస్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని అక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు. వారికి కలిగిన కొంత అసౌకర్యానికి ఇంత పని చేశారని చెబుతున్నారు. గతంలో ఫామ్ హౌస్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రాకూడదని నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ కంప్లైంట్ ప్రకారం తాజాగా ఫాంహౌస్ నిర్వాహక సిబ్బందిని పోలీసులు విచారణ జరిపారు. కాల్పుల అనంతరం అక్కడ పడి ఉన్న బుల్లెట్లను సేకరించిన పోలీసులు.....స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆవుకు బుల్లెట్ గాయాల ఘటన తర్వాత ఫాంహౌస్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అర్థం అవుతోంది. ఆ ఫాంహౌస్ కు చెందినవారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.... ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పోలీసులు నిజాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.