ఎప్పుడు పాకిస్తాన్ భారతదేశం లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అనే విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా భారతదేశంలోకి రహస్యంగా ఉగ్రవాదులను పంపించి ఇక వారి చేత ఎన్నో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు భారత్లో పాకిస్తాన్ సృష్టించిన విధ్వంసాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి.. అయితే భారత్లోని కాశ్మీర్లో పుల్వామా లో జరిగిన దాడి ఘటన గురించి ఇప్పటికి కూడా భారత్ మరిచిపోలేదు అని చెప్పాలి. దేశాన్ని మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘటన. సైనికులు వాహనంలో వెళుతున్న సమయంలో ఉగ్రవాది సైనికుల వాహనాలకు అడ్డుగా వెళ్లి ఆత్మాహుతి దాడి చేయడంతో ఎంతోమంది సైనికులు ప్రాణాలు.



 ఈ ఘటన పాకిస్తాన్ పని భారత ప్రభుత్వానికి తెలిసినప్పటికీ... పాకిస్తాన్ మాత్రం దీని గురించి ఏమీ అంగీకరించ లేదు అన్న విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు తప్పు తెలుసుకున్న పాకిస్తాన్ పుల్వామా దాడి ఘటన తమదే  అంటూ చెప్పింది. భారత్లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులతో ఆత్మాహుతి దాడికి పాల్పడి మారణహోమం సృష్టించడానికి కారణం పాకిస్థాన్ అంటూ ఇటీవలే ప్రకటన కూడా చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ మంత్రి పవద్  చౌదరి ప్రకటించారు. పుల్వామా లో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటన... ఇమ్రాన్ ఖాన్ సొంతమే అంటూ ఏకంగా పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.



 కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన మారణహోమం లో పాకిస్థాన్ ప్రభుత్వ పాత్ర ఎంతగానో ఉందని... ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఈ దాడి చేయించారు అంటూ పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా మంత్రి ప్రకటించడం ప్రస్తుతం సంచలన గా మారిపోయింది. 2019 సంవత్సరంలో పుల్వామా లో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 40 మంది భారత సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఇన్ని  రోజుల వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది అని ఆరోపణలు చేసిన భారత్ ఇక ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ మంత్రి ఈ విషయాన్ని ఒప్పుకోవడంతో మరోసారి ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేరాఫ్ అడ్రస్ అన్న విషయం నిర్ధారణ అయింది అని భారత ప్రభుత్వం కూడా విమర్శలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: