వివరాల్లోకి వెళితే... మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలంకి చెందిన నరసింహ అంజలి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి యూసఫ్ గూడా సమీపంలో యాదగిరి నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మల్లికార్జున మూడో తరగతి చదువుతుండగా... చిన్న కొడుకు కి నాలుగేళ్ల వయస్సు ఉంది. ఇక ఇటీవల అనారోగ్యంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. దీంతో తన నాలుగేళ్ల చిన్న కొడుకును చూసుకోవాలని పెద్దకొడుకు చెప్పింది తల్లి.
అంతేకాకుండా తమ పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఇంటి బయట నుంచి గడియ పెట్టి తాళం వేసింది. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో అన్న తమ్ముడి కోసం ఎంతో ప్రేమగా ఉయ్యాల కట్టాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఉయ్యాల పెద్ద కొడుకు మల్లికార్జున మెడకు చుట్టుకుంది. బాలుడు విలవిలలాడి పోయాడు. అయితే బయట నుంచి తాళం వేయడంతో కనీసం స్థానికులు కూడా లోపల జరిగిన విషయాన్ని గుర్తించలేకపోయారు దీంతో ఊపిరాడక విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు బాలుడు. తల్లిదండ్రుల ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.