ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాలి. ఇక టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని టిఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగి జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఇటీవల హైదరాబాద్లోని జిహెచ్ఎంసి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం లోని 138 వ మౌలాలి డివిజన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టిఆర్ఎస్ అభ్యర్థి ముంతాజ్ ఫాతిమా అమీనుద్దిన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని డివిజన్ అభివృద్ధి చెందడానికి టిఆర్ఎస్ అభ్యర్థి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అంటూ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది పలు పథకాల గురించి ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.