తెలంగాణ రాష్ట్రంలో పాగా వెయ్యాలని బిజెపి ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో  తమ హవా నడుస్తున్న బిజెపి తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి బలపడాలని ప్రయత్నించినప్పటికీ కుదరడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బిజెపి. అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన దుబ్బాక  ఉప ఎన్నికల్లో బిజెపి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడంతో విజయం సాధించిన విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇక దుబ్బాక ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా తప్పనిసరిగా భారీ మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాం  అని బిజెపి ధీమాతో ఉంది. దీని కోసం బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా ప్రచారం చేపట్టారు అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయమైనా ఓటమి అయినా బిజెపి కి ఒక క్లారిటీ వచ్చే  అవకాశం ఉంది అని ప్రస్తుతం విశ్లేషకులు అంటున్నారు.



 ఒకవేళ దుబ్బాకలో జరిగినట్లుగానే జీహెచ్ఎంసీ ఎన్నిక లో కూడా బిజెపి భారీ మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అంటే ఇక తెలంగాణ ప్రజానీకం మొత్తం టిఆర్ఎస్ పాలనతో విసిగిపోయి బిజెపి ని గెలిపించడానికి రెడీగా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు విశ్లేషకులు. ఒకవేళ భారీ మెజారిటీ సాధించినప్పటికీ మేయర్ పీఠాన్ని దక్కించుకొక  పోతే.. రానున్న  రోజుల్లో బిజెపి బలపడానికి మరింత అవకాశం ఉంది అని అర్థం చేసుకోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఎలాంటి మెజారిటీ సాధించకుండా ఓటమి చవి చూస్తే... ఇక బీజేపీ తెలంగాణ లో పాగా వేయడానికి చాలా కష్టపడాల్సి ఉంది అని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: