పూర్తి పారదర్శకంగా అమ్మఒడి పథకం లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. గతేడాది 43,54,600 మంది లబ్ధిదారులకు ‘అమ్మ ఒడి’ కింద రూ. 6,336 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. జగనన్న అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 డబ్బు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా మంత్రి సురేష్ మాట్లాడారు.. ‘‘అమ్మ ఒడి పొందేందుకు ఈ నెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 16 నుంచి 19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శన.. ఈ నెల 20 నుంచి 24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం. ఈ నెల 26న అమ్మ ఒడి లబ్దిదారుల ఫైనల్ లిస్టు ప్రదర్శన. ఈ నెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం.’’ ఇలా దశల వారీగా అర్హులందరికీ న్యాయం చేస్తాయని మంత్రి సురేష్ మాట్లాడారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి