ఈ క్రమంలోనే రైతుల ఉద్యమాల్లో జియో రిలయన్స్ కు సంబంధించిన విషయాలను తెరమీదికి తీసుకురావడంపై ప్రస్తుతం విశ్లేషకులు తీవ్రస్థాయిలో తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జియో వాడకాన్ని తగ్గించి నిషేధించాలని రైతుల ఉద్యమంలో రైతులు నినాదాలు చేసినంత జియో నెట్వర్క్ కి ఎక్కడ వినియోగదారుల సంఖ్య తగ్గడం లేదని...జియోనీ బహిష్కరించి కార్పొరేట్ కంపెనీలకు ప్రజలకు దూరం పెంచాలి అంటున్న రైతులు మరి జియో కాకుండా ఇతర నెట్వర్క్లు కూడా కార్పొరేట్ అన్న విషయాన్ని మర్చిపోయి ఉంటాయి అంటున్నారు విశ్లేషకులు.
రైతులు జియోని బహిష్కరించి రిలయన్స్ ఫ్రెష్ ని నిషేదించాలని నినాదాలు చేసినప్పటికీ...రిలయన్స్ ఫ్రెష్ కి వెళ్లే కస్టమర్ల సంఖ్య ఎక్కడా తగ్గలేదు. అంతేకాకుండా జియో నెట్వర్క్ వాడుతున్న కస్టమర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఇటీవలే ఏకంగా 1.75 కోట్ల మంది కొత్త యూజర్లు రాగా ఎయిర్టెల్ కి కేవలం 6.3 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చారు ఇక మిగతా నెట్వర్క్లకు రోజురోజుకు యూజర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఇలా రైతులు ఉద్యమం చేసినప్పటికీ జియో ని మూసివేసే పరిస్థితి మాత్రం లేదు అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి