అయితే గతంలో తరచూ పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో సైన్యం కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా 2003 సంవత్సరంలోభారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అనే విషయం తెలిసిందే. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా పాకిస్థాన్ మాత్రం బుద్ది మార్చుకో లేదు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూనే ఉంటుంది పాకిస్తాన్. కొన్నిసార్లు భారత్ లోకి అక్రమంగా ఉగ్రవాదులను పంపించి కాల్పులకు తెగబడేలా చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే కొన్ని సార్లు పాకిస్తాన్ ఆర్మీ సైతం కాల్పులకు తెగబడుతూ ఉంటుంది.
అయితే గత 18 ఏళ్ల లో మొదటిసారి అత్యధికంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినది పాకిస్తాన్. ఈ ఏడాది ఎల్ఏసి వెంబడి మొత్తంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని 5100 సార్లు ఉల్లం గించి కాల్పులకు తెగబడింది. ప్రతిరోజూ సగటున 14 కేసులు నమోదయ్యాయి. 2003లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా.. గత 18 ఏళ్ల లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. పాకిస్తాన్ దాడిలో 36 మంది భారత జవాన్లు వీర మరణం పొందగా 136 మంది గాయపడ్డారు. ఇది 2020 సంవత్సరం లో భారత భద్రతా దళాలు 203 మంది ఉగ్రవాదులను హతమార్చడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి