అసలు నేటి రోజుల్లో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది. అభం శుభం తెలియని చిన్నారుల దగ్గరి నుంచి అంతా తెలిసిన పెద్దల వరకు కూడా అందరూ చిన్న చిన్న కారణాలకే మనస్థాపం చెంది..ఇక ఈ జీవితం వృధా అనుకుని కఠిన నిర్ణయం తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతూ  ఎంతో విలువైన ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఓ యువతి ఇదే పని చేసి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపింది.



 చిత్తూరుకు చెందిన ఓ యువతి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. కూతురు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తుంది అని ఆ తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారూ. తమ కూతురిని ఒక అయ్య చేతిలో పెడితే తమ బాధ్యత తీరిపోతుంది అని అనుకున్నారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తమ కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి లాంఛనాలు మొత్తం మాట్లాడారు.  అంతలో ఏమైందో తెలియదు కానీ పెళ్ళికొడుకు కుటుంబీకులు పెళ్లి క్యాన్సల్ చేసుకోవడంతో ఇక ఆ యువతి ఎంతగానో మనస్థాపం చెందింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకుని ఏకంగా బలవన్మరణానికి పాల్పడింది.



 డల్లాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న సుష్మా అనే యువతి ఇటీవలే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సోదరుడు చిత్తూరులో నివాసముంటున్న తల్లిదండ్రులకు సుష్మా మరణవార్తను చేరవేశారు. అయితే ఇటీవలే పూతలపట్టు ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడితో వివాహం కుదిరింది. అతను కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాక వరుడు కుటుంబీకులు ఏదో కారణం చెప్పి వివాహాన్ని రద్దు చేశారు. పెళ్లి ఆగిపోయిందనే మనస్థాపం చెందిన సుష్మ ఇక పెళ్లిపీటలు ఎక్కాల్సిన రోజు ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుడు కుటుంబీకులపై సుష్మ కుటుంబీకులు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: